ఏపీలో మొదలైన టీడీపీ కూటమి విధ్వంస పాలన! తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం కూల్చివేత ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేత ప్రారంభం. ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేత. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ నిన్న హైకోర్టును ఆశ్రయించిన వైయస్ఆర్ సీపీ. చట్టాన్ని మీరి వ్యవహరించ వద్దని హైకోర్టు ఆదేశం. సీఆర్డీయే కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలను తెలియజేసిన వైయస్ఆర్ సీపీ న్యాయవాది హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైయస్ఆర్ సీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేత. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామంటున్న వైయస్ఆర్ సీపీ.